యాప్నగరం

ట్రైన్ బాత్రూమ్‌లో మర్డర్.! తిరుపతిలో ఘోరం

యశ్వంత్‌పూర్ - టాటానగర్ ట్రైన్‌ బాత్రూమ్‌లో మృతదేహాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Samayam Telugu 29 Dec 2020, 11:41 am
తిరుపతిలో ఘోరం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పసికందుని ట్రైన్ మరుగుదొడ్డిలో హత్య చేసిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయవాడలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు కేసును తిరుపతి రైల్వే పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. తిరుపతి రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్‌ వెళ్లే 12890 ట్రైన్ విజయవాడ రైల్వే స్టేషన్‌కి చేరిన సమయంలో బోగీ బాత్రూమ్‌లో ఆడశిశువు మృతదేహాన్ని గుర్తించారు. ప్రయాణికులు గమనించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. శిశువును హత్య చేసినట్లు గుర్తించిన విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో హత్య తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలియడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.