యాప్నగరం

Chittoor: సొంత మనవరాలినే కిడ్నాప్ చేసిన అమ్మమ్మ, ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంలో 14ఏళ్ల వయసున్న కూతురు కూతురిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

Samayam Telugu 11 Jul 2021, 11:35 am
చిత్తూరు జిల్లాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాను చెప్పిన పనిని కూతురు చేయలేదన్న కోపంతో సొంత మనవరాలినే కిడ్నాప్ చేయించిందో ఓ అమ్మమ్మ. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలోని తిరుచానూర్‌లో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
Samayam Telugu Image


Also Read: నాటుసారా అమ్ముతున్న గ్రామ వాలంటీర్... ఇంట్లోనే దుకాణం, షాకిచ్చిన పోలీసులు

తిరుచానూర్‌కు చెంది లక్ష్మి అనే మహిళకు చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమెకు 14ఏళ్ల కూతురు ఉంది. లక్ష్మి తల్లి ఓబుళమ్మ, అన్నవదిన ఆదినారాయణ, లింగమ్మ చిత్తూరులో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు మురళీ కృష్ణ(29) అనే కుమారుడు ఉన్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మురళీకృష్ణకు ఇంకా వివాహం జరగకపోవడంతో తన మనవరాలిని ఇచ్చి చేయాలని ఓబుళమ్మ అనుకుంది. ఇదే విషయాన్ని తన కూతురికి చెప్పగా.. పిల్లకి 14ఏళ్లు కూడా నిండలేదు, బాగా చదువుకుంటోంది, అయినా ఇద్దరికి 15ఏళ్ల వయసు తేడా ఉంది.. అని లక్ష్మి పెళ్లికి నిరాకరించింది. అయినా సరే మేనకోడలిని తమ కొడుక్కి ఇచ్చి పెళ్లా చేయాలని అన్నావదిలను కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు.

Also Read: ‘నిన్ను ప్రేమిస్తున్నా.. భర్తను వదిలేసి నాతో వచ్చేయ్’... వివాహితకు యువకుడి వేధింపులు

ఎంత బ్రతిమాలినా కూతురు తమ మాట వినకపోవడంతో ఓబుళమ్మకు కోపం వచ్చింది. మనవరాలిని తన మనవడికి ఇచ్చి ఎలాగైనా పెళ్లి చేయాలనుకుంది. శనివారం కిరాయి మనుషులతో తన మనవరాలిని కిడ్నాప్ చేయించింది. తన కూతురిని తల్లే కిడ్నాప్ చేయించిందని తెలిసుకున్న లక్ష్మి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.