యాప్నగరం

చిత్తూరు: కానిస్టేబుళ్లతో కలిసి పేకాడిన ఎస్ఐ... షాకిచ్చిన విలేకరులు

చిత్తూరు జిల్లా పలమనేరులో కానిస్టేబుళ్లతో కలిసి లాడ్జీలో పేకాట ఆడుతూ ఎస్‌ఐ పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నించగా విలేకరులు ఎస్పీకి తెలియజేశారు.

Samayam Telugu 6 Jan 2021, 9:56 am
కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసే జూదాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే జూదగాళ్ల అవతారమెత్తారు. ఖాళీ దొరికింది కదాని అందరూ కలిసి లాడ్జీలో పేకాట ఆడారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుళ్లతో కలిసి భోజన విరామ సమయంలో లాడ్జీలోకి వెళ్లి పేకాట ఆడుతూ పట్టుబడటం జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్‌ వ్యాపారికి రూ.8కోట్ల టోకరా.. గోవాలో పట్టుబడిన కిలేడీ

లాడ్జీలో పోలీసులు పేకాట ఆడుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు పేకాట ఆడుగున్న ఎస్ఐ, కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ డిపార్ట్‌మెంట్ వారే అన్న స్వార్థంతో ఆలోచించిన పోలీసులు ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక విలేకరులు ఈ విషయాన్ని ఎస్పీకి దృష్టికి తీసుకెళ్లడంతో వారి బండారం బయటపడింది. ఎస్పీ ఆదేశాలతో పలమనేరు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Also Read: షిర్డీ యాత్రికుల బస్సులో మంటలు.. అప్రమత్తతో తప్పిన ముప్పు, 21 మంది సురక్షితం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.