యాప్నగరం

Tirumala Steps: భార్యను ఎత్తుకొని తిరుమల మెట్లు ఎక్కిన గోదావరి జిల్లావాసి.. వీడియో వైరల్

Tirumala Steps: తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల్లో చాలా మంది కాలిడకన తిరుమల చేరుకోవడానికి ఇష్టపడతారు. రాజమండ్రికి చెందిన సత్తిబాబు, లావణ్య దంపతులు కూడా ఇలాగే మెట్లు ఎక్కుతూ వెళ్తుండగా.. గబాగబా మెట్లు ఎక్కేస్తున్న భర్తకు ‘దమ్ముంటే నన్ను ఎత్తుకొని మెట్లు ఎక్కడి’ అని లావణ్య ఛాలెంజ్ చేసింది. ఆమె సవాల్‌ను స్వీకరించిన సత్తిబాబు భార్యను భుజంపై కూర్చోబెట్టుకొని గబగబా మెట్లు ఎక్కేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 2 Oct 2022, 12:08 pm

ప్రధానాంశాలు:

  • భార్యను ఎత్తుకొని తిరుమల మెట్లు ఎక్కిన వ్యక్తి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • భార్య ఛాలెంజ్ చేయడంతోనే ఇలా..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సత్తిబాబు
సత్తిబాబు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల్లో చాలా మంది నడకదారిన వెళ్లడానికి ఇష్టపడతారు. కొందరైతే కాలినడకన ఏడుకొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. నడక మార్గంలో.. ఆ మెట్లన్నీ ఎక్కి తిరుమల కొండపైకి చేరే సరికి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దవుతుంది. శారీరకంగా ఫిట్‌గా ఉన్న వాళ్లు కూడా మెట్లు ఎక్కేసరికి అలసిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి తాను మెట్లు ఎక్కడమే కాదు.. తన భార్యను మోస్తూ.. తిరుమల మెట్లు ఎక్కేశాడు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్య దంపతులు. వీరిద్దరూ ఇటీవల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా వీరు తిరుమల చేరుకుంటుండగా.. సత్తిబాబు వేగంగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. అది చూసిన లావణ్య.. మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా ఛాలెంజ్ చేసింది.

సతీమణి సవాల్‌ను సీరియస్ గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా సత్తిబాబు భార్యను మోసుకుంటూ మెట్లు ఎక్కుతుంటే.. మిగతా భక్తులు ఫొటోలు, వీడియోలు తీశారు. తన భార్యను మోస్తూ.. తిరుమల మెట్లు ఎక్కిన వీడియోను సత్తిబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
View this post on Instagram A post shared by Sattibabu Kadiyapulanka (@sattibabu222228kadiyapulanka)
పెళ్లయిన కొత్తలో ఇలాగే ఉంటుందిలే అనుకుంటున్నారా... సత్తిబాబు, లావణ్యలకు పెళ్లయ్యి 24 ఏళ్లు అవుతోదంట. వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా.. వారికి పెళ్లిళ్లు చేశారట. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని పెద్ద అల్లుడు గురుదత్త(చందు) వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారట. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు సాహసం చేశారని సమాచారం.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.