యాప్నగరం

TTD: ఆ ట్వీట్ డిలీట్ చేసిన రమణ దీక్షితులు.. వెనక్కి లాగిందెవరు?

Ramana Dikshitulu చేసిన ట్వీట్‌పై దుమారం రేగింది. టీటీడీలో అర్చక వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికి ఆ ట్వీట్ కనిపించలేదు.. ఆయన డిలీట్ చేశారు. గతంలో కూడా టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీక్షితులు.. తాజాగా మరోసారి ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. ఏపీ ప్రభుత్వం టీటీడీలో అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీని నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సూచనలు చేసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Sep 2022, 6:40 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ramana Dikshitulu
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) మరోసారి వివాదాస్పద ట్వీట్‌పై దుమారం రేగుతోంది. బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయని.. వారు ఆలయ విధానాలతోపాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. గతంలో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని అర్చకులు భావించారన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్ర నిరాశపరిచింది అన్నారు.
ఇదిలా ఉంటే రమణ దీక్షితులు కొంతసేపటి తర్వాత ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ కనిపించలేదు. కానీ అప్పటికే కొందరు స్క్రీన్ షాట్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రమణ దీక్షితులు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు గతంలో కూడా దీక్షితులు కొన్ని ట్వీట్‌లు చేశారు. 2-04-2021న తమను తిరిగి టీటీడీ బాధ్యతల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ టీటీడీ మాత్రం తమ విధులను విత్ హోల్డ్‌లో ఉంచిందని ఆరోపించారు. ఇప్పటికీ తాము కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని.. ప్రభుత్వం అర్చకులకు ఫ్రెండ్లీగా ఉందని.. టీటీడీ మాత్రం అర్చకుల వ్యవస్థను నాశనం చేసేలా ఉందన్నారు. ఈ ట్వీట్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీ అర్చకులకు సంబంధించి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమలు చేసింది. ఈ నిబంధనల ప్రచారం 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, శ్రీనివాస మూర్తి దీక్షితులు, నరసింహ దీక్షితులు, నారాయణ దీక్షితులతో పాటు మరో ఐదుగురు రిటైర్ అయ్యారు. గోవింద రాజ స్వామి ఒకరు, తిరుచానూరులో ఇద్దరు అర్చకులు కూడా పదవీ విరమణ చేశారు.

ఈ క్రమంలో తిరుచానూరు ఆలయం ప్రధాన అర్చకుడు, మరొక అర్చకుడు హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై 2018 డిసెంబర్‌లో రిటైర్డ్ నిబంధనను వర్తింపచేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అర్చకులు అందరూ ఇవే ఆదేశాలను తమకు అమలు చేయాలని టీటీడీ అధికారులను కోరారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌ను దీక్షితులు కలిసి సమస్యను వివరించగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్నారు. ఆ తర్వాత రమణ దీక్షితుల్ని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారు. అలాగే టీటీడీ రిటైర్డ్ అయ్యిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమను శ్రీవారి కైంకర్యాలను నిర్వహించనీయడం లేదని రమణ దీక్షితులు పరోక్షంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇటు వంశపారంపర్యంగా టీటీడీలో అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచనలు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్‌రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.