యాప్నగరం

Tirumala శ్రీవారి సన్నిధిలో శిల్ప కళలు.. ఈ నైపుణ్యం అద్భుతం

Tirumala: ఆ క్షేత్రం శిల్ప కళల సౌందర్యం. అబ్బురపరిచే వింతలకు నిలయం. అంతకు మించి ఎందరో విద్యార్థుల ప్రతిభకు అద్దం. అవును.. టీటీడీ శిల్ప కళాశాలకు చెందిన విద్యార్థులు తమ చేతులతో అద్భుతం చేశారు. ఎన్నో రకాల శిల్పాలను రూపొందించారు. తాజాగా.. వాటి అమ్మకాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. అంత‌రించిపోతున్న శిల్ప‌క‌ళ‌ను.. భావిత‌రాల‌కు అందిస్తున్న శిల్ప‌క‌ళా నిపుణుల‌ను అభినందించారు. భవిష్యత్తులో శిల్ప కళల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 13 Feb 2023, 3:10 pm

ప్రధానాంశాలు:

  • టీటీడీ శిల్ప కళాశాలలో.. శిల్పకళా ప్రదర్శన
  • శిల్పాల అమ్మకాలు ప్రారంభించిన ఈఓ ధర్మారెడ్డి
  • కళలను ప్రోత్సాహించేందుకు ప్రదర్శనలు ఏర్పాటు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Art Exhibition
శిల్పకళా ప్రదర్శన
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం శిల్ప కళాశాలలో.. శిల్ప కళా ప్రదర్శన ప్రారంభమైంది. శిల్పాల అమ్మకాలను.. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రారంభించారు. శిల్ప కళలను మరింత ప్రోత్సాహించేందుకు ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. శిల్ప కళా విద్యార్థులు తయారు చేసిన శిల్పాలను.. అమ్మకానికి ఉంచామని చెప్పారు. భవిష్యత్తులో శిల్ప కళలను మరింత అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వివరించారు. అంత‌రించిపోతున్న శిల్ప‌క‌ళ‌లను.. భావిత‌రాల‌కు అందిస్తున్న విద్యార్థులను అభినందించారు.
టీటీడీ మాత్రమే వాస్తు నిర్మాణం, శిల్పకళ, పెయింటింగ్ వంటి కళలను గుర్తించి.. ప్రోత్సాహిస్తోందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ శిల్ప క‌ళాశాల‌ను.. 1960లో ప్రారంభించింద‌ని.. ఆరు దశాబ్దాలుగా ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వందలాది మంది విద్యార్థులు నాలుగేళ్ల కోర్సును పూర్తి చేసి.. వివిధ రంగాలలో స్థిరపడ్డార‌ని వివరించారు. ఇంత‌టి గొప్ప సంస్థ.. ఎందరో కళాకారులను ప్రపంచానికి అందించాలని కోరుకుంటున‌ట్లు వ్యాఖ్యానించారు. భావి తరాలకు సుసంపన్నమైన ఆలయ సంస్కృతిని.. శిల్ప సంప‌ద‌ను అందించేందుకు కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు.

టీటీడీ శిల్పకళా ప్రదర్శన

" />శిల్ప క‌ళాశాల విద్యార్థులు.. క‌ళా నైపుణ్యాల‌ను పెంపొందించుకుని రాణించాల‌ని ధర్మారెడ్డి సూచించారు. భార‌త‌దేశం క‌ళ‌ల కాణాచి అని.. ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఆల‌యాల్లో అపార‌మైన శిల్ప‌క‌ళ ఉంద‌ని వివరించారు. ప‌ల్ల‌వులు, చోళులు, విజ‌య‌న‌గ‌ర రాజుల కాలంలో అమూల్య‌మైన శిల్ప సంప‌ద ల‌భించింద‌న్నారు. వాటి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. శిల్ప కళ అంతరించిపోతుందనే ఆందోళన ఉండేదని.. దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేశారు.

టీటీడీ శిల్పకళా ప్రదర్శన

టీటీడీ శిల్పకళా ప్రదర్శన

Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.