యాప్నగరం

మదనపల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. 30మందికి గాయాలు

Madanapalle Road Accident బెంగళూరు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు బార్లపల్లె దగ్గర అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పుత్తూరు దగ్గర కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోగా క్రేన్ సాయంతో జాగ్రత్తగా బయటకు తీశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 25 May 2023, 2:04 pm

ప్రధానాంశాలు:

  • మదనపల్లె సమీపంలో బస్సు ప్రమాదం
  • 30మంది ప్రయాణికులు గాయాలయ్యాయి
  • పుత్తూరు సమీపంలోనూ మరో రోడ్డు ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Madanapalle Road Accident
అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి మదనపల్లెకు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు మదనపల్లె రూరల్ మండల పరిధిలోని బార్లపల్లె సమీపంలో కూకటిమాని గడ్డ అదుపుతప్పి లోయలో పడిపోయింది. రోడ్డుపై ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా అతివేగంగా వచ్చిన బస్సు అదుపతప్పి లోయలోకి బోల్తా కొట్టింది. డ్రైవర్ ఓవర్ స్పీడ్‌తో నడుపుతుండటంతోనే అదుపు చేయలేక కారును ఢీకొట్టి పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మరో పది నిమిషాలలో మదనపల్లెకు బస్సు చేరుకునే సమయంలో ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ ఘటనలో 30 మందికి స్వల్పంగా గాయపడగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బాధితులను 108 అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు నుంచి తిరుపతి వెళ్తోన్న ప్రైవేట్ బస్సును.. తిరుత్తణి నుంచి వస్తోన్న ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ సహా 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కండక్టర్‌కు తీవ్ర గాయాలు కాగా.. బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులకు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.