యాప్నగరం

కూతురి నాలుక కోసి తినేసిన పద్మజ..? మదనపల్లె హత్యల కేసులో విస్తుగొలిపే వాస్తవాలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో దిగ్భ్రాంతికి గురి చేసే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అలేఖ్యను చంపేశాక.. ఆమె తల్లి పద్మజ నాలుక కోసి తినేసిందని పురుషోత్తమ నాయుడు చెప్పినట్లు సమాచారం.

Samayam Telugu 30 Jan 2021, 4:18 pm
మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో విచారణ జరిపే కొద్దీ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు.. మూఢ నమ్మకంతో తమ కూతుళ్లిద్దర్నీ దారుణంగా హతమార్చడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కాగా తనను తాను కాళికగా భావించుకున్న పద్మజ.. తన పెద్ద కూతురు అలేఖ్యను హతమొందించిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసిందని.. పద్మజ భర్త పురుషోత్తమ నాయుడు చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని సమాచారం. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే అసలు నిజమేంటో తేలనుంది.
Samayam Telugu Andhra Pradesh twin murder


ఈ హత్యలకు కారణం పెద్దకూతురు అలేఖ్యేనని తెలుస్తోంది. భోపాల్‌లో చదివే సమయంలో ఆధ్మాతిక బోధకుల ప్రసంగాలు, రచనలకు ఆమె ఆకర్షితురాలయ్యారని.. నిత్య అదే ధ్యాసలో ఉండటం వల్ల భ్రమల్లోకి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. తాను గత జన్మలో అర్జుడినని అలేఖ్య చెప్పేదని ఆమె తండ్రి డాక్టర్లకు తెలిపారు.

కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తమ నాయుడు, పద్మజలను శుక్రవారం ఉదయం మదనపల్లె సబ్‌జైలు నుంచి తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. వీరిద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు ఉన్నాయని.. చికిత్స అందించడం కోసం వైజాగ్ రిఫర్ చేశామని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్య నిపుణులు తెలిపారు.

‘నా బిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇంటికి వెళ్లాలి. జైలులో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు’.. అంటూ డాక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు పద్మజ చెప్పడం గమనార్హం. పద్మజ తండ్రి, మేనమామకు కూడా మానసిక సమస్యలు ఉండేవని.. వంశపారంపర్యంగా ఆమెకు, ఆమె పిల్లలకు కూడా ఆ సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు.

నాలుక కోయలేదన్న లాయర్..
మదనపల్లె సబ్‌ జైలులో ఉన్న పురుషోత్తంను హైకోర్టు న్యాయవాది రజని కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. జంటహత్యల ముద్దాయిలను ఎవరో ప్రేరేపించారని చెప్పారు. అలేఖ్య నాలుకను పద్మజ కోసి తినేసిందనే వార్తల్లో వాస్తవం‌ లేదన్నారు. శరీరంలో ఒక అవయవం తెగిపడినా ఆత్మ వెనక్కి తిరిగి రాదని వారికి తెలుసన్నారు. వారిద్దరూ దేవుళ్లను నమ్మారే గానీ క్షుద్ర పూజలను కాదన్నారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు తాను పురుషోత్తమ్‌ను కలిశాన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.