యాప్నగరం

దేవుడైతే ఒక వరమే ఇస్తారు.. జగన్ మాత్రం ఎన్నినైనా ఇస్తారు: వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్

ఏర్పేడు మండలంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి డప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 11 May 2022, 10:14 pm
పండుగలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పల్లం, పల్లంపేట, పల్లం గొల్లపల్లిలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడపగడపకు వెళ్తున్నప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే తనకు ఎనలేని సంతోషం కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక కుటుంబంలో సంక్షేమ పథకం ద్వారా సంతోషాన్ని నింపుతున్నారని కొనియాడారు.
Samayam Telugu ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి


'ఏర్పేడు మండలంలో పర్యటించినప్పుడు ప్రజలు నేడు ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న పథకాల గురించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అన్న ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రతి ఇంటిలో దేవుడిలా ఆరాధిస్తున్నారు. దేవుడిని అడిగితే ఒక వరమే ఇస్తాడేమో.. జగన్ మాత్రం ఎన్నినైతా ఇస్తారు..' అని ఎమ్మెల్యే అన్నారు.

గత ప్రభుత్వంలో అధికారం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. కానీ జగనన్న ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని.. సంక్షేమ పథకాలను అమలుపరిచారని అన్నారు. కరోనా మహమ్మారి, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన అప్పులు, ప్రకృతి బీభత్సాన్ని సైతం తట్టుకొని ప్రజలకు మేలు చేస్తున్న జగన్ అన్న మంచి మనసు దూరదృష్టి మరెవ్వరికీ లేదని కితాబిచ్చారు. ఆయా గ్రామాలలోని చిన్న చిన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చారని.. సమస్యల పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.