యాప్నగరం

చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. ఆ రెండు చోట్ల పోటీకి దూరం..?

Chittoor జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సరైన వివరాలు సమర్పించలేకపోవడంతో వారి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి.

Samayam Telugu 7 Nov 2021, 7:01 am
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బంగారుపాళ్యం, కలకడ మండలాల జడ్పీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాఖలు నామినేషన్ పత్రాలు సరిగా తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి, డీఆర్వో ఎంఎస్‌ మురళి తెలిపారు. నామినేషర్ల తిరస్కరణపై కలెక్టర్‌కు అప్పీలు చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Samayam Telugu చిత్తూరు జిల్లా


బంగారుపాళ్యం జడ్పీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిరిబాబు నామినేషన్ వేశారు. అయితే ఆయన ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం రుణం చెల్లించలేదని.. ప్రత్యర్థి అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి మురళి తెలిపారు.

అదేవిధంగా కలకడ జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం నాయకురాలు సురేఖ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆమె సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డులో పుట్టిన తేదీలు వేర్వేరుగా ఉన్నాయని.. వయసు ధ్రువీకరణ పత్రం సమర్పించలేదని ఎన్నికల అధికారి తెలిపారు. అంతేకాకుండా డిక్లరేషన్ ఫామ్‌లో సాక్షి సంతకం చేసిన వ్యక్తి.. తన చిరునామాను రాయలేదని చెప్పారు. దీంతో ఆమె నామినేషన్ తిరస్కరించినట్లు తెలిపారు. తిరస్కరణపై వారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు కలెక్టర్ సమక్షంలో అప్పీలు చేసుకోవచ్చని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.