యాప్నగరం

పులివెందులలో ఇన్‌సైడర్ ట్రేడింగ్.. వైఎస్ ఫ్యామిలీ కోట్ల రూపాయలు: రవి సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ కుటుంబ సభ్యులు అక్కడి స్థలాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని విమర్శించారు. ఇంటి పట్టాలు పొందిన వారి స్థలాల్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారని చెప్పారు.

Samayam Telugu 25 Jan 2021, 6:53 am
Samayam Telugu బీటెక్ రవి
కడప జిల్లా పులివెందులలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ రవి. జేఎన్‌టీయూ సమీపంలో మెడికల్‌ కళాశాల వస్తోందంటూ వైఎస్‌ కుటుంబ సభ్యులు అక్కడి స్థలాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని విమర్శించారు. కొన్ని రోజులకు బేస్తవారిపల్లె సమీపంలో ఏర్పాటు చేస్తారంటూ ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పటికీ మెడికల్‌ కాలేజీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు.

పులివెందుల మార్కెట్‌ యార్డు వెనుక వైపు వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలనూ ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఇంటి పట్టాలు పొందిన వారి స్థలాల్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రవి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏకంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడం చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.