యాప్నగరం

Srikalahasti: ఇంతకంటే అన్యాయం ఉంటుందా.. జనసేన మహిళా నేత ఆవేదన

Srikalahasti: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చిందేపల్లి గ్రామం లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈసీఎల్ కంపెనీ అక్రమంగా గోడ కట్టిందని.. దాన్ని తొలగించే వరకు పోరు ఆగదని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇటు అమాయకులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 144 సెక్షన్ పేరుతో గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఆ గోడను తొలగించే వరకు పోరాటం ఆపబోమని.. జనసేన మహిళా నేత కోట వినూత స్పష్టం చేస్తున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Mar 2023, 8:23 pm

ప్రధానాంశాలు:

  • శ్రీకాళహస్తి నియోజకవర్గం చిందేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
  • ఈసీఎల్ కంపెనీ అక్రమంగా గోడ కట్టిందని ఆరోపణలు
  • పోరాటం ఆపేది లేదంటున్న జనసేన నేత కోట వినూత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vinutha Kota
వినూత కోట
Srikalahasti: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని చిందేపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈసీఎల్ కంపెనీ అక్రమంగా గోడ కట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ గోడను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని దీక్షకు దిగారు. వీరికి శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోట వినూత మద్దతు ప్రకటించారు. వారి కోసం ఆమరణ నిరాహారా దీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై.. జనసేన నేత వినూత (vinutha kota) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అక్రమ కేసులు పెట్టి తిరుపతి జిల్లా పరిసరాల పోలీసు స్టేషన్లు తిప్పుతూ.. అమాయకులను వేధిస్తున్నారు. గ్రామస్తులకు న్యాయం చేయకపోతే చిందేపల్లికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారు. చిందేపల్లి ఘటనలో 144 సెక్షన్‌లతో పోలీసులు కేసులు పెట్టారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తాం. శాంతియుతంగా నిరాహారదీక్ష చేస్తుంటే చెప్పులు, బూట్లతో ఆలయంలోకి పోలీసులు వచ్చారు. ఈసీఎల్ కంపెనీ అక్రమంగా కట్టిన గోడను తొలగించేవరకు పోరు ఆగదు. దశాబ్దాల కాలంగా ఉన్న రోడ్డుకు అడ్డంగా.. ఈసీఎల్ కంపెనీ కట్టిన గోడకు 200 మంది పోలీసులు రక్షణగా ఉన్నారు' అని జనసేన వినూత వ్యాఖ్యానించారు.

శ్రీకాళహస్తి.. ఏర్పేడు మండలాల సరిహద్దులో స్టీల్‌ కాస్టింగ్స్‌ పరిశ్రమ నడుస్తోంది. ఈ పరిశ్రమ మధ్యలో ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామానికి దారి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే.. పరిశ్రమ విస్తరణలో భాగంగా.. ఆ దారిని యాజమాన్యం మూసివేయించింది. దీంతో తాము ఎంతో కాలంగా వినియోగిస్తున్న దారిని మూసివేయడంపై చిందేపల్లి గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. అధికారులను కూడా ఆశ్రయించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రాజకీయ నాయకులను ఆశ్రయించారు. వారికి జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ వినూత మద్దతు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. ఈనెల 27వ తేదీ నుంచీ వినూత గ్రామస్తులతో కలసి శివాలయం వద్ద నిరాహార దీక్షకు దిగారు. అయితే.. సోమవారం నాటికి ఆమెతో పాటు దీక్షలో ఉన్న గ్రామస్తుల ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు ఆ గ్రామానికి వచ్చారు. పోలీసుల గుర్తించిన ఆందోళనకారులు.. శివాలయం గర్భ గుడిలోకి వెళ్లి తలుపులు మూసేశారు. దీంతో పోలీసులు గర్భ గుడి తలుపులు తెరిచి బయటకు తీసుకొచ్చారు. జనసేన మహిళా నేత వినూతను అంబులెన్సులో ఎక్కించి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అదే సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.