యాప్నగరం

Kuppam: కుప్పంలో మళ్లీ ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ప్రచారరథాన్ని దౌర్జన్యంగా లాగేసుకుందని ఆరోపించారు. పోలీసులు ప్రచార రథాన్ని ఇవ్వకపోవడంతో.. తన కేరావాన్ పైకి ఎక్కి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 6 Jan 2023, 4:15 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబు కుప్పంలో పర్యటనలో ఉద్రిక్తత
  • రోడ్డుపై బైఠాయించిన తెలుగుదేశం పార్టీ చీఫ్
  • ప్రచార రథాన్ని ఇవ్వడానికి నిరాకరించిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu Kuppam Tour
రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
Kuppam: ప్రభుత్వం తన ప్రచారరథాన్ని దౌర్జన్యంగా లాగేసుకుందని.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన ప్రజలను కలవనీయకుండా అడ్డుకుంటుంటోందని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను ఎక్కడి నుంచి మాట్లాడాలని అడిగితే.. పోలీసుల నుంచి సమాధానం లేదన్నారు. వెంటనే Chandrababu తన కేరావాన్ పైకి ఎక్కి ప్రసంగించారు. ఈ సందర్భంగా గుడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
మూడో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి చేరుకున్న చంద్రబాబును.. పోలీసులు (AP Police) అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తన ప్రచార రథం తనకు అప్పగించాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తన సమావేశం జరుగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. గుడిపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.

పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదని వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను చూస్తున్నానని.. బానిసలుగా బతకొద్దని సూచించారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మూల్యం తప్పదని హెచ్చరించారు. నన్ను పంపేయాలని చూస్తే.. మిమ్మల్నే పంపిస్తా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.