యాప్నగరం

శ్రీకాళహస్తి: దైవ దర్శనం నుంచి తిరిగొస్తూ.. ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం, మృతుల్లో యువ వైద్య దంపతులు

Srikalahasti People Died In Accident At Tamil Nadu తిరువణ్ణామలై వెళ్లిన భార్యాభర్తలు, కొడుకు, కోడలు. దైవ దర్శనం పూర్తి చేసుకుని సొంత ఊరికి బయల్దేరారు. కొద్ది దూరం రాగానే ఊహించని ప్రమాదం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారును మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులతో పాటూ కోడలు ప్రాణాలు కోల్పోయారు. తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన రోడ్డు ప్రమాదం

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 May 2023, 1:03 pm

ప్రధానాంశాలు:

  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
  • శ్రీకాళహస్తికి చెందిన ముగ్గురు దుర్మరణం
  • మృతుల్లో యువ వైద్య దంపతులు ఉన్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Srikalahasti People Died In Tamil Nadu Accident
దైవ దర్శనం నుంచి తిరిగొస్తూ ఒకే కుటుంబంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురి ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లెకు చెందిన దయాసాగర్‌రెడ్డి, మధుమతి దంపతులు పాతికేళ్ల క్రితం శ్రీకాళహస్తిలోని బంగారమ్మ కాలనీలో స్థిరపడ్డారు. సిమెంటు ఇటుకల బట్టీ వ్యాపారం నిర్వహించారు. వారి కుమారుడు సూర్యతేజరెడ్డి చిత్తూరు అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు. ఏడాది క్రితం రాజమండ్రికి చెందిన గైనకాలజిస్టు మౌనికరెడ్డితో సూర్యకు వివాహం చేశారు.
మౌనికరెడ్డి విజయనగరంలో ఎండీ కోర్సు చదువుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమెకు పరీక్షలు ముగియడంతో ఇంటి దగ్గర విందుకు ఏర్పాట్లు చేశారు. మరో నెలలో శ్రీకాళహస్తి శివారులో ఉన్న స్థలంలో కొత్తగా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చైత్ర పౌర్ణమి విశేషంగా భావించి తిరువణ్ణామలైలోని అరుణాచల గిరిప్రదక్షిణకు భార్యాభర్తలు, కొడుకు, కోడలితో కలిసి నలుగురూ వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి కారులో శ్రీకాళహస్తి బయలుదేరారు.

వీరు తిరువణ్ణామలైకు 50కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత కనమంగళం సమీపంలోని గాంధీనగరం రోడ్డులో వీరి కారు.. ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దయాసాగర్‌రెడ్డి, ఆయన కుమారుడు సూర్యతేజరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధుమతి, మౌనికలు తీవ్రంగా గాయపడగా.. వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ మౌనిక మార్గమధ్యంలో చనిపోయారు.. మధుమతి పరిస్థితి కూడా విషమంగా ఉంది
ఈ ప్రమాదంలో తిరువణ్ణామలైకి వెళుతున్న మినీ బస్సు డ్రైవరుతో పాటు లోపలున్న నలుగురు యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. యువ వైద్య దంపతులతో పాటు కుటుంబ పెద్ద చనిపోగా.. ఆయన భార్య విషమ పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.