యాప్నగరం

పండుగ పూట ఘోరం, రెండు బైక్‌లు ఢీ: ముగ్గురు యువకులు మృతి

చిత్తూరు జిల్లాలో పండుగ పూట ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం..

Samayam Telugu 15 Jan 2022, 12:06 pm
చిత్తూరు జిల్లాలో పండుగ పూట ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి మదనపల్లె రూరల్ మండలం ఐదో మైలు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఒకరు మరణించారు. చికిత్స పొందుతూ మిగిలిన ఇద్దరు తెల్లవారుజామున మృతి చెందారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాలు ఇలా.. వాల్మీకిపురం మండలం చంతపర్తి గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ (21) అనే యువకుడు అతని స్నేహితుడు సిద్ధిక్‌ (21)తో కలిసి మదనపల్లె నుంచి బైక్‌పై శుక్రవారం రాత్రి చింతపర్తికి వెళ్తున్నారు. మదనపల్లె రూరల్‌ కొత్తవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (40) మరో బైక్‌పై వీరికి ఎదరుగా వస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైక్‌లు మదనపల్లె రూరల్‌ ఐదో మైలు వద్దకు రాగానే ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అటుగా వెళుతున్న వారు గమనించి 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో శ్రీవాసులు, తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఇస్మాయిల్‌, సిద్ధిక్‌ మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె రూరల్‌ పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.