యాప్నగరం

కడపలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురు మహిళలు బలి

ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి కారణమైంది. ఆటోని ఢీకొనడంతో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో జరిగింది.

Samayam Telugu 12 Jan 2021, 5:28 pm
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టడంతో దారుణం జరిగిపోయింది. ముగ్గురు మహిళల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ అత్యంత విషాద ఘటన ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల వద్ద జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళలను పెద్ద దుద్యాల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు, నుజ్జునుజ్జైన ఆటో
kadapa accident


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.