యాప్నగరం

బైక్‌పై వెళ్తున్న జంటపై అమాంతం దూకిన పులి.. షాక్

ఆలయానికి వెళ్లే మార్గంలో చెట్టుపై మాటువేసిన పులి ఒక్కసారిగా బైక్‌ పైకి దూకి దాడి చేసింది. దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.

Samayam Telugu 25 Jul 2021, 4:20 pm
బైక్‌పై గుడికి బయలుదేరిన దంపతులకు ఊహించని షాక్ ఎదురైంది. అటవీ ప్రాంతంలో వెళ్తుండగా మాటువేసిన పులి అమాంతం దంపతులపై దూకింది. అదే సమయంలో వెనక నుంచి కారు రావడంతో అక్కడి నుంచి పారిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వడమాలపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు, మంజులాదేవి దంపతులు బైక్‌పై నారాయణవనం మండలంలోని సింగరికోన ఆలయానికి బయలుదేరారు. గుడికి వెళ్లే మార్గంలో చెట్టుపై మాటువేసిన పులి సుబ్రహ్మణ్యం దంపతులపైకి దూకింది. అదే సమయంలో వెనక నుంచి కారు రావడంతో పులి అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటనలో దంపతులకి గాయాలవడంతో పుత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tiger


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.