తిరుమల శ్రీవారి దర్శనం ఆన్లైన్ టోకెన్లకు డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా శ్రీవారి ఎస్ఈడీ టికెట్ల కోసం ఆన్లైన్లో ప్రయత్నించడంతో రికార్డు సమయంలో టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు లభించలేదు. దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్సైట్లో ఏడు లక్షల హిట్లు వచ్చాయి. కేవలం మొదటి 24 నిమిషాల్లోనే రెండు లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. 45 నిమిషాల వ్యవధిలో 3.35 లక్షల టికెట్లు, గంటలో 4 లక్షల 20 వేల టికెట్లు భక్తులు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 6 లక్షల 50 వేల టికెట్లు, 1.30 గంటలకు నవంబర్, డిసెంబర్కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్ నెలల టికెట్లను టీటీడీ ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. గత నెలలో రోజుకు 8 వేల ఎస్ఈడీ టికెట్లు జారీ చేయగా ప్రస్తుతం రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను విడుదల చేయగా మధ్యాహ్నం 1:30 గంటలకల్లా భక్తులు వీటిని కొనుగోలు చేశారు. టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం లభించింది.
తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలర్ట్. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలర్ట్. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.