యాప్నగరం

తిరుమల: శ్రీవారికి భక్తుడి భారీ కానుక.. విలువ ఎంతో తెలుసా!

ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

Samayam Telugu 27 Oct 2021, 12:20 pm

ప్రధానాంశాలు:

  • తిరుమల శ్రీవారికి భారీ కానుక
  • అందజేసిన తమిళనాడు భక్తుడు
  • రూ.1.83 కోట్ల విలువవైన బంగారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తిరుమల
తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భారీ కానుక అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 27,006 మంది భక్తులు దర్శించుకున్నారు. ఏకంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.47 కోట్ల వచ్చినట్టు టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారికి 12,376 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.