శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలతో అక్టోబర్లో జరిగే బ్రహ్మోత్సవాలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కరోనా ఉధృతి ఉందని.. రాబోయే రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరికలు జారీ చేసిందన్నారు. అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. మరో వారంలో ఆన్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్ ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేక పోతున్నాయని.. అందుకోసం జియో వాళ్ళతో సంప్రదింపులు జరిపామన్నారు. త్వరలోనే సర్వదర్శన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది కూడా అలాగే
కరోనా ఉధృతి ఉందని.. రాబోయే రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరికలు జారీ చేసిందన్నారు. అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Samayam Telugu 17 Sep 2021, 12:41 pm
ప్రధానాంశాలు:
- ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- కరోనా కారణంగా టీటీడీ కీలక నిర్ణయం
- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా