తిరుమల శ్రీనివాసుడి భక్తులకు శుభవార్త. శ్రీవారి సర్వ దర్శన టికెట్లను అతి త్వరలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారంలోగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా దాదాపు 5 నెలలపాటు శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే జారీ చేస్తోంది. ప్రత్యేక ప్రవేశదర్శనం, ప్రముఖుల సిఫార్సులు, సుపథం వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారిని దర్శనభాగ్యం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్తామా అని ఆరాటపడుతున్నారు.
సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు టీటీడీ స్పందించింది. సెప్టెంబరు 8వ తేదీ నుంచి రోజుకు 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే.. చాలా మంది ఈ విషయం తెలియక తిరుపతి వెళ్లి, నిరాశగా తిరుగుముఖం పడుతున్నారు.
పైగా.. ఈ టోకెన్లను పొందడానికి చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి అదుపు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్లో సర్వదర్శన టోకెన్లు అందుబాటులోకి తేచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఆరాట పడుతున్నారో.. అందరికీ దర్శనభాగ్యం కల్పించడానికీ తామూ అంతే ఆరాటపడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రస్తుతం సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. టోకెన్ల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయని వివరించారు. మొత్తానికి తిరుమల శ్రీవారిని భక్తులు ఉచితంగా దర్శించుకునే భాగ్యం అతి త్వరలోనే పూర్తి స్థాయిలో లభించబోతోంది.
సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు టీటీడీ స్పందించింది. సెప్టెంబరు 8వ తేదీ నుంచి రోజుకు 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే.. చాలా మంది ఈ విషయం తెలియక తిరుపతి వెళ్లి, నిరాశగా తిరుగుముఖం పడుతున్నారు.
పైగా.. ఈ టోకెన్లను పొందడానికి చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి అదుపు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్లో సర్వదర్శన టోకెన్లు అందుబాటులోకి తేచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఆరాట పడుతున్నారో.. అందరికీ దర్శనభాగ్యం కల్పించడానికీ తామూ అంతే ఆరాటపడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రస్తుతం సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. టోకెన్ల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయని వివరించారు. మొత్తానికి తిరుమల శ్రీవారిని భక్తులు ఉచితంగా దర్శించుకునే భాగ్యం అతి త్వరలోనే పూర్తి స్థాయిలో లభించబోతోంది.