తిరుమలకు వెళ్లే భక్తులకు షాక్.. టీటీడీ సంచలన నిర్ణయం, ఆ సర్టిఫికేట్ తప్పనిసరి
TTD కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu 22 Sep 2021, 1:39 pm
ప్రధానాంశాలు:
- సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
- తిరుమలకు వెళ్లాలంటే సర్టిఫికేట్ మస్ట్
- భక్తులు సహకరించాలన్న ఛైర్మన్ వైవీ
Tirumalaకు వెళ్లే భక్తులకు టీటీడీ షాకిచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. 26 నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుంపులుగా నిలబడటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.