తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 55,823 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 23,799 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరగ్గా.. చాలా రోజుల తర్వాత రికార్డ్ స్థాయిలో హుండీకి ఆదాయం వచ్చింది. కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మార్చి నెల వర్చువల్ టికెట్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లు ఉన్నాయి. టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇంటినుంచే వర్చువల్ విధానంలో సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరింది. ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మార్చి నెల వర్చువల్ టికెట్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లు ఉన్నాయి. టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇంటినుంచే వర్చువల్ విధానంలో సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరింది. ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.