యాప్నగరం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో నాటు బాంబుల కలకలం

ఐ బ్లాక్‌ సమీపంలో ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ కుక్క, పంది చనిపోయాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న యూనివర్సిటీ క్యాంపస్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Samayam Telugu 1 Apr 2021, 10:31 am
తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ ఆవరణలో నాటు బాంబులు కలకలం రేపాయి. యూనివర్శిటీ ఐ బ్లాక్‌ సమీపంలో ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ కుక్క, పంది చనిపోయాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న యూనివర్సిటీ క్యాంపస్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబులుగా వాటిని గుర్తించారు.
Samayam Telugu తిరుపతి


పెరుమాళ్లపల్లెకు చెందిన ఇద్దరు అనుమానితులను యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. యూనివర్శిటీ క్యాంపస్‌లోనే ఇలా నాటు బాంబులు పేలడం చర్చనీయాంశంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.