యాప్నగరం

వైఎస్ జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ... దానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సీఎం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి సోమవారం సీఎం జగన్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.

Samayam Telugu 22 Jun 2021, 9:29 am

ప్రధానాంశాలు:

  • వైఎస్ జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ
  • పైపులైన్ నిర్మాణం కోసం రూ.30కోట్లు ఇవ్వాలవి విన్నపం
  • గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భూమన కరుణాకర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని సీఎంని కోరారు. నగరాభివృద్ధికి ఇటీవల రూ.183కోట్లు నిధులు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన భూమన... తెలుగుగంగ ప్రాజెక్టు కింద ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు రెండో పైపులైను పెండింగ్‌ పనుల పూర్తికి మరో రూ.30 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు.
Also Read: ‘జగనన్న గోరుముద్ద’లో పురుగులు... విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం

నగరంలో నిర్మిస్తున్న గరుడ వారధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు టీటీడీ ద్వారా అదనపు నిధులు మంజూచేయాలని అభ్యర్థించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పైపులైన్‌ పనుల కోసం రూ. 30కోట్లు మంజూరుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి పదవీకాలం పొడిగిస్తారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: మరీ ఇంత ఘోరమా... ఇలాగైతే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు?: చీవాట్లు పెట్టిన హైకోర్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.