తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులకు అలర్ట్. దర్శనం టికెట్ల పేరుతో కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రూ.300 టికెట్లను భక్తులకు ఇవ్వగా.. దర్శనానికి వెళ్లిన భక్తులను అధికారులు అడ్డుకున్నారు. వారు చెప్పిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాలు ఇలా.. పాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియన్ అనే వ్యక్తి.. అతని స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారికి తిరుపతిలో ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌందర్ అనే వ్యక్తులు రూ.300 దర్శనం టికెట్లను విక్రయించారు. ఇందుకోసం ఫోన్ పే ద్వారా రూ.8 వేలు చెల్లించారు. ఆ టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లిన భక్తులు.. దర్శనం కాంప్లెక్స్లోని స్కానింగ్ సెంటర్లో అధికారులకు దొరికిపోయారు. అవి నకిలీ టికెట్లుగా తేలాయి.
దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా.. తిరుపతిలో తమకు టికెట్లు విక్రయించినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన తిరుమల టూటౌన్ పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. దర్శనం టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసే వాహనాలను, డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. భక్తులు దర్శనం టికెట్ల పేరుతో మోసపోవద్దని.. అనుమానం వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పూర్తి వివరాలు ఇలా.. పాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియన్ అనే వ్యక్తి.. అతని స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారికి తిరుపతిలో ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌందర్ అనే వ్యక్తులు రూ.300 దర్శనం టికెట్లను విక్రయించారు. ఇందుకోసం ఫోన్ పే ద్వారా రూ.8 వేలు చెల్లించారు. ఆ టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లిన భక్తులు.. దర్శనం కాంప్లెక్స్లోని స్కానింగ్ సెంటర్లో అధికారులకు దొరికిపోయారు. అవి నకిలీ టికెట్లుగా తేలాయి.
దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా.. తిరుపతిలో తమకు టికెట్లు విక్రయించినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన తిరుమల టూటౌన్ పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. దర్శనం టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసే వాహనాలను, డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. భక్తులు దర్శనం టికెట్ల పేరుతో మోసపోవద్దని.. అనుమానం వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.