తిరుపతి రుయా ఆస్పత్రి సిబ్బంది తీరు ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. వారం రోజుల క్రితమే చనిపోయిన బాలుడిని అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్లాలంటే రూ. 10 వేలు డిమాండ్ చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తాజాగా, డబ్బు కోసం పేద రోగులను హింసిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేద ప్రజలకు ఉచితంగా సేవ చేయాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది.. ఇలా డబ్బు కోసం వేధిస్తుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి రుయాలో డబ్బులు ఇస్తే తప్ప వైద్య సిబ్బంది సేవలు అందించడం లేదంటూ ఓ రోగి బంధువు ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఆపరేషన్ కోసం రుయా ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆపరేషన్కి ముందు షేవింగ్ చేయడానికి రూ. 100, బెడ్ మీదకు తీసుకురావడానికి రూ. 400 డిమాండ్ చేశారని రోగి బంధువు నాగరత్న తెలిపారు. డబ్బులు లేవని చెబితే ఎంతో కొంత ఇవ్వాలని ఒత్తిడి చేశారన్నారు. దీంతో బాధితురాలు సిబ్బందికి గూగుల్ పే చేసి, ఆ స్క్రీన్ షాట్ అధికారులకు పంపించారు. అలాగే, రుయా సిబ్బందికి రూ. 400 పంపిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ నేపథ్యంలో రుయా ఆసుపత్రిలో సిబ్బంది అవినీతికి పాల్పడ్డట్లు జరుగుతున్న ప్రచారం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వెల్లడించారు. ఈ మేరకు తిరుపతిలో ఆదివారం డాక్టర్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. భాధితురాలు నాగరత్నం ధైర్యం చేయడంతో సిబ్బంది అవినీతి వ్యవహారం విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఎంఎన్వో, ఓటీ అసిస్టెంట్ ద్వారా నగదు తీసుకున్నాడని విచారణలో తెలిందన్నారు.
గుగుల్ పే ద్వారా రూ. 400 నగదు వేసుకున్నట్లు గుర్తించామని డాక్టర్ భారతి పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రోగుల సహాయకుల వద్ద నుంచి నగదు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ1 సర్వీసెస్లో పని చేసే కాంట్రాక్టు మహిళా ఉద్యోగి.. రోగుల వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆమెను ప్రస్తుతం విధుల నుంచి తొలగించామని, మొత్తం నలుగురు సిబ్బందిపై విచారణ జరుపుతున్నట్లు డాక్టర్ భారతి వెల్లడించారు.
తిరుపతి రుయాలో డబ్బులు ఇస్తే తప్ప వైద్య సిబ్బంది సేవలు అందించడం లేదంటూ ఓ రోగి బంధువు ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఆపరేషన్ కోసం రుయా ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆపరేషన్కి ముందు షేవింగ్ చేయడానికి రూ. 100, బెడ్ మీదకు తీసుకురావడానికి రూ. 400 డిమాండ్ చేశారని రోగి బంధువు నాగరత్న తెలిపారు. డబ్బులు లేవని చెబితే ఎంతో కొంత ఇవ్వాలని ఒత్తిడి చేశారన్నారు. దీంతో బాధితురాలు సిబ్బందికి గూగుల్ పే చేసి, ఆ స్క్రీన్ షాట్ అధికారులకు పంపించారు. అలాగే, రుయా సిబ్బందికి రూ. 400 పంపిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ నేపథ్యంలో రుయా ఆసుపత్రిలో సిబ్బంది అవినీతికి పాల్పడ్డట్లు జరుగుతున్న ప్రచారం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వెల్లడించారు. ఈ మేరకు తిరుపతిలో ఆదివారం డాక్టర్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. భాధితురాలు నాగరత్నం ధైర్యం చేయడంతో సిబ్బంది అవినీతి వ్యవహారం విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఎంఎన్వో, ఓటీ అసిస్టెంట్ ద్వారా నగదు తీసుకున్నాడని విచారణలో తెలిందన్నారు.
గుగుల్ పే ద్వారా రూ. 400 నగదు వేసుకున్నట్లు గుర్తించామని డాక్టర్ భారతి పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రోగుల సహాయకుల వద్ద నుంచి నగదు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ1 సర్వీసెస్లో పని చేసే కాంట్రాక్టు మహిళా ఉద్యోగి.. రోగుల వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆమెను ప్రస్తుతం విధుల నుంచి తొలగించామని, మొత్తం నలుగురు సిబ్బందిపై విచారణ జరుపుతున్నట్లు డాక్టర్ భారతి వెల్లడించారు.