యాప్నగరం

తిరుపతివాసులు, తిరుమల వెళ్లేవారికి ముఖ్యమైన అలర్ట్.. ఈ మార్పులు గమనించండి, పాస్‌లు ఎక్కడిస్తారంటే

Tirumala Garuda Seva Traffic Restrictions ను గమనించాలని సూచిస్తున్న పోలీసులు. అక్టోబర్ 1 ఉదయం నుంచి 6 గంటల నుంచి నిర్దేశించి ప్రదేశాల్లో ఉచితంగా పాసులు అందజేస్తారు. అంతేకాదు ఈ నెల 30న మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 2 మధ్యాహ్నం వరకు వాహనాలు అనుమతించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Sep 2022, 9:50 am

ప్రధానాంశాలు:

  • తిరుమలలో శనివారం గరుడ సేవ
  • మూడు లక్షల మంది వచ్చే ఛాన్స్
  • ట్రాఫిక్ ఆంక్షలు గమనించండి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Garuda Seva Traffic Restrictions
తిరుపతివాసులకు ముఖ్యమైన గమనిక. అక్టోబర్ 1న శ్రీవారి గరుడసేవ (Tirumala Garuda Seva) ఉండటంతో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అక్టోబరు 1 ఉదయం 6 గంటల నుంచి నిర్దేశించిన ప్రదేశాల్లో ఉచితంగా పాసులు అందజేస్తారన్నారు. కడప జిల్లా నుంచి వచ్చే భక్తులు కుక్కల దొడ్డి దగ్గర ఉన్న కేశవరెడ్డి హైస్కూల్‌, కరకంబాడి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద కారు పాసులు ఇస్తారు. నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఏర్పేడు శ్రీ ఇంజినీరింగ్‌ కళాశాల దగ్గర.. చెన్నై వైపు నుంచి వచ్చే కార్లకు ఆగస్త్య ఎన్‌క్లేవ్‌ నియర్‌ టోల్‌ప్లాజా దగ్గర.. చిత్తూరు వైపు నుంచి వచ్చే వాటికి ఐతేపల్లి అగ్రికల్చరల్‌ ల్యాండ్‌లో, మదనపల్లె నుంచి వచ్చే వాటికి శ్రీ విద్యానికేతన్‌ ఇంజిజనీరింగ్‌ కాలేజ్‌ వద్ద పాసులు ఇవ్వనున్నారు. భక్తులు సహకరించాలని పోలీసులు కోరారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ (Tirumala Garuda Seva) చాలా ముఖ్యమైనది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రతా, ట్రాఫిక్‌ సమస్యల దృష్ట్యా ఈ నెల 30న శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్లలో బైకుల రాకపోకలపై నిషేధం విధించారు. తిరిగి 2న మధ్యాహ్నం నుంచి అనుమతిస్తారు. మరోవైపు వాహనదారులు అంతా తిరుపతిలో నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తులు ఏపీఎస్ బస్‌లను ప్రయాణం కోసం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

ఇటు టీటీడీ (TTD) కూడా గరుడ సేవ (Tirumala Garuda Seva) కోసం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకున్నారు.. సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గేట్ల దగ్గర ఉన్న హారతి పాయింట్ల‌లో హారతులకు బ‌దులుగా.. భక్తులను స్వామి వారి వాహ‌న సేవకు అనుమ‌తిస్తారు. అందుకే ఈ ఏడాది హార‌తుల‌ను రద్దు చేసి సామ‌న్య భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి హార‌తి పాయింట్లో 10 వేల‌ మందికి గరుడసేవ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే గ్యాలరీల‌లో రెండు లక్షల మంది, ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజన మండపం వద్దకు షాపింగ్ కాంప్లెక్స్ నుండి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అద‌నంగా దర్శనం కల్పించవచ్చు అంటున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు తిరుమలకు వచ్చే భక్తులు.. వీలైనంత వరకు సొంత వాహనాలను కొండపైకి తీసుకురావొద్దని కోరింది. 20వేల వాహనాలు దాటిన తర్వాత కొండపైకి వాహనాలను అనమతించేది లేదన్నారు. భక్తులు సహకరించాలని టీటీడీ, పోలీసులు కోరారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.