తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసింది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో స్వామి వారు విహరించనున్న నేపథ్యంలో ఈసారి భక్తుల పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. తిరుమలలో ఇప్పటికే భక్తుల రద్దీ పెరిగింది. నిత్యం వేలాది మంది స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వస్తున్నారు. సెప్టెంబరు 26 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగినవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు తిరుమల మాడవీధుల్లో వివిధ రకాల వాహనసేవల్లో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు - కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగినవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు తిరుమల మాడవీధుల్లో వివిధ రకాల వాహనసేవల్లో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు - కార్యక్రమాలు
- సెప్టెంబరు 27: ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ
- సెప్టెంబరు 28: చిన్నశేష వాహనం (ఉదయం), స్నపన తిరుమంజనం (మధ్యాహ్నం), హంస వాహనసేవ (రాత్రి)
- సెప్టెంబర్ 29: సింహ వాహనసేవ (ఉదయం), ముత్యపు పందిరి వాహనసేవ (రాత్రి)
- సెప్టెంబర్ 30: కల్పవృక్ష వాహనసేవ (ఉదయం), సర్వభూపాల వాహన సేవ (రాత్రి)
- అక్టోబర్ 1: మోహినీ అవతారంలో స్వామి దర్శనం (ఉదయం), గరుడ వాహనసేవ (రాత్రి)
- అక్టోబర్ 2: హనుమంత వాహనసేవ (ఉదయం), గజ వాహనసేవ(రాత్రి)
- అక్టోబర్ 3: సూర్యప్రభ వాహనసేవ (ఉదయం), చంద్రప్రభ వాహనసేవ (రాత్రి)
- అక్టోబర్ 4: రథోత్సవం (చెక్క రథం), అశ్వ వాహనసేవ (రాత్రి)
- అక్టోబర్ 5: చక్రస్నానం (ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు), ధ్వజారోహణం (రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు)