యాప్నగరం

తిరుమలకు నడకదారుల్లో వెళ్లే శ్రీవారి భక్తులకు మరో శుభవార్త.. ఇకపై సులభతరంగా ఉండేలా!

Tirumala Luggage Delivery System కు సంబంధించి టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తులకు సులభంగా, త్వరితగతిన లగేజీని అందించేందుకు యాంత్రీకరణ చేయాలన్నారు టీటీటీ ఈవో. భక్తుల నుంచి కూడా అభిప్రాయాలు ీసుకోవాలని.. ట్రాలీలు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. కొన్ని మార్పులు, చేర్పులను కూడా సూచించారు. అలాగే అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలని ఆదేశించారు టీటీటీ ఈవో. మరోవైపు తాళపత్ర గ్రంథాలు భద్రపరచడానికి అవసరమైన భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించింది టీటీడీ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 Apr 2023, 9:00 am

ప్రధానాంశాలు:

  • తిరుమల భక్తుల లగేజీ విధానంపై సమీక్ష
  • కీలక సూచనలు చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
  • కొన్ని మార్పులు, చేర్పులను కూడా సూచించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Luggage Delivery
తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడిచి వెళ్లే భక్తులకు మరో శుభవార్త. ఇకపై లగేజీని మరింత సులభంగా తిరుమలలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో లగేజీ యాంత్రికరణ ద్వారా రవాణా, డెలివరీ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రెండు నడక మార్గాల్లో భక్తులు భద్రపరిచిన లగేజి సామర్థ్యాన్ని పెంచేందుకు యాంత్రికరణను చేస్తూ త్వరితగతిన మరింత సులభంగా అందించాలన్నారు. తిరుమలలో భక్తులు లగేజి తీసుకోవడానికి అవసరమైన డెలివరీ కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్ తో ప్రయోగాత్మకంగా పనిచేస్తున్న కేకేసి, సుపథం కేంద్రాల వద్ద రోజువారి లగేజీ డెలివరీల సంఖ్య, భక్తుల నుండి అభిప్రాయ సేకరణ తీసుకోవాలన్నారు.

లగేజి డెలివరీ కేంద్రాల సంఖ్య మరింత పెంచిన తర్వాత అక్కడ అవసరమైన లగేజీ బ్యాగుల నెంబరు, బార్ కోడ్ నెంబరు తదితర అంశాలు కనిపించేలా ఎలక్ట్రానిక్ సమాచార ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లగేజి డెలివరీ కేంద్రాల్లో అవసరమైనన్ని ట్రాలీలు ఏర్పాటు చేయాలని, సివిల్ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కౌంటర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు.

ఈవో ధర్మారెడ్డి లగేజీ కౌంటర్ల వద్ద డిపాజిట్, రవాణా, డెలివరీ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన (పిపిటి) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించి పలు సూచనలు, మార్పులు చేశారు. వచ్చేవారం పూర్తిస్థాయిలో దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మరోవైపు తాళపత్ర గ్రంథాలు భద్రపరచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో అధికారుల బృందం వేద విశ్వవిద్యాలయం లో స్థలాన్ని పరిశీలించారు. పరిశోధన భవనం వెనుకవైపున ఉన్న ఖాళీ స్థలం ఈ భవన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు.

పురావస్తు శాఖ, ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉన్న పురాతన తాళ పత్ర గ్రంథాలను డిజిటైజ్ చేసి భావితరాలకు అందుబాటులో ఉంచాలని టీటీడీ మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్కాన్ చేసిన తాళ పత్రాలను మరో 500 సంవత్సరాలు గడచినా చెక్కు చెదరకుండా ఉండేలా భద్రపరచడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సనాతన జీవన ట్రస్ట్ ఈ భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో అధికారులు స్థల పరిశీలన జరిపారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.