తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. రోజుకు 10 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 1 నుంచి 15కు సంబంధించిన టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. భక్తులు టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా, ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తప్పని పరిస్థితిలో ఆన్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ నుంచి రద్దు చేశామన్నారు.
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నా.. అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు.
వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి.. సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నా.. అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు.
వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి.. సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.