శనివారం జరిగిన టీటీడీ పాలక మండలి చివరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బోర్డు నిర్ణయాలను వెల్లడించారు. తిరుపతిలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతం గరుడవారధి ఆగిన ప్రదేశం నుంచి అలిపిరి వరకు నిర్మించాలని తీర్మానించామన్నారు. త్వరలోనే నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయానికి బాలాలయం జరుగుతున్న వేళ ఆలయం వాకిలి, వాకిలి చట్రం, గర్భాలయం ప్రవేశ ద్వారాలకు వెండి తొడుగులు అమర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించతలపెట్టిన 500 ఆలయాలను కరోనా కారణంగా నిర్మించలేకపోయామని, రాబోయే ఏడాదిలో ఇవి పూర్తి చేసేలా తీర్మానించినట్టు తెలిపారు. ఏడాదిన్నరలో కశ్మీర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. TTD ఆధ్వర్యంలో ఉన్న ప్రతి గుడిలో ఓ గోమాతను ఉంచుతామని, ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని దాదాపు 100 గుళ్లలో అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. టీటీడీ పరిధిలో అన్ని విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని సుబ్బారెడ్డి వెల్లడించారు.
90 రోజుల్లో దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని శాశ్వత విధానంలో నియమిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సహజ పంటలపై అన్ని జిల్లాలకు చెందిన రైతులతో త్వరలోనే చర్చిస్తామని తెలిపారు.
తిరుమలలో అనధికార దుకాణాలు, తట్టలను వారం రోజుల్లో తొలగిస్తామని ఛైర్మన్ తెలిపారు. లైసెన్సులు కలిగిన దుకాణదారులతోపాటు, వారికి అనుమతించిన వారే వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకునేందుకు తీర్మానించినట్లు వెల్లడించారు. తిరుపతి, తిరుచానూరులో నివసిస్తున్న అర్హతకలిగిన హెచ్డీపీపీ పింఛనుదారులకు టీటీడీ పింఛనుదారుల తరహాలోనే పుణ్యక్షేత్ర భారభృతి భత్యం రూ.500 నుంచి రూ.700 పెంచేందుకు బోర్డు తీర్మానించిందని తెలిపారు.
90 రోజుల్లో దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని శాశ్వత విధానంలో నియమిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సహజ పంటలపై అన్ని జిల్లాలకు చెందిన రైతులతో త్వరలోనే చర్చిస్తామని తెలిపారు.
తిరుమలలో అనధికార దుకాణాలు, తట్టలను వారం రోజుల్లో తొలగిస్తామని ఛైర్మన్ తెలిపారు. లైసెన్సులు కలిగిన దుకాణదారులతోపాటు, వారికి అనుమతించిన వారే వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకునేందుకు తీర్మానించినట్లు వెల్లడించారు. తిరుపతి, తిరుచానూరులో నివసిస్తున్న అర్హతకలిగిన హెచ్డీపీపీ పింఛనుదారులకు టీటీడీ పింఛనుదారుల తరహాలోనే పుణ్యక్షేత్ర భారభృతి భత్యం రూ.500 నుంచి రూ.700 పెంచేందుకు బోర్డు తీర్మానించిందని తెలిపారు.