యాప్నగరం

సామాన్య భక్తుల కోసం టీటీడీ సరికొత్తగా.. డిసెంబర్ 1 నుంచి తిరుమలలో మార్పులు

Tirumala Vip Break Darshan Time Changed మారనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సామాన్య భక్తుల కోసం టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. నెల రోజుల పాటూ ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి కొత్త విధానాన్ని అమలు చేయడమా.. పాత విధానాన్ని కొనసాగించడమా అనేది టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Nov 2022, 6:49 am

ప్రధానాంశాలు:

  • టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది
  • తిరుమలలో సరికొత్త మార్పులు
  • డిసెంబర్ 1 నుంచి అమల్లోకి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Vip Break Darshan Time Changed
టీటీడీ (TTD)సామాన్య భక్తుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్‌ దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులను ప్రస్తుతం ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి మాత్రంఉదయం 8 గంటలకు అనుమతిస్తారు.. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్టు టికెట్ల భక్తులకు ముందుగా అనుమతి ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి జనరల్‌ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులను.. అనంతరం టీటీడీ ఉద్యోగుల కుటుంబసభ్యులను దర్శనానికి అనుమతిస్తారు.

తాజా నిర్ణయంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుందని టీటీడీ తెలిపింది. ఈ విధానాన్ని నెలరోజుల పాటూ పరిశీలించి ఇలాగే కొనసాగించాలా.. లేని పక్షంలో పాత పద్ధతినే అమలుచేయాలా అని టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. గతంలో వీఐపీ దర్శనాలు లేవు.. కానీ ఆ తర్వాత వీఐపీ దర్శనం, సిఫార్సుల లేఖలు ప్రారంభమయ్యాయి. అలాగే సయాంత్రం నైవేద్య సమర్పణ తర్వాత కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించేవారు. ఆ తర్వాత ఉదయం కూడా వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి.

సామాన్య భక్తులకు దర్శన సమయంపై విమర్శలు రావడంతో 2012లో గురువారం మినహా మిగిలిన రోజుల్లో సాయంత్రం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. 2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను పూర్తిగా రద్దు చేయగా.. కేవలం ఉదయం మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కొనసాగుతున్నాయి. వీరిలో కూడా ముందు ప్రోటోకాల్, తర్వాత శ్రీవాణి ట్రస్ట్, అనంతరం సిఫార్సు లేఖలపై టికెట్లున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతోంది. ఈ బ్రేక్‌ దర్శనాలకే మూడు, నాలుగు గంటల సమయం పడుతుండటంతో సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందిపడుతున్నారు.. వేచి ఉంటున్నారు. అందుకే ఈ సమయాన్ని తగ్గించేందుకు ఈ మార్పులు చేసింది. వేకువజామున ఆలయం తెరిచి శ్రీవారికి కైంకర్యాలు, నివేదనలను పూర్తిచేసిన తర్వాత సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అనంతరం వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లున్నవారిని దర్శనానికి అనుమతిస్తే, సామాన్య భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గుతుందనేది టీటీడీ ఆలోచన. అందుకే డిసెంబర్ 1 నుంచి మార్పులు చేర్పలు చేసింది టీటీడీ.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.