యాప్నగరం

వ్యవసాయ బావిలో చిన్నారుల మృతదేహాలు, తల్లి అదృశ్యం.. మిస్టరీగా ఘటన

చిత్తూరు జిల్లాలోని ఓ వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఓ మహిళ ఇద్దరు బిడ్డలతో కలిసి నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయింది.

Samayam Telugu 8 Jan 2021, 11:38 am
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావిలో ఇద్దరు చిన్నారులు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లాలోని 46వ డివిజన్‌కు చెందిన ఓబనపల్లిలో ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. చిన్నారులను ఉదయ్(5) ఝాన్సీ(8)గా గుర్తించారు.
Samayam Telugu Image


Also Read: భార్య కాపురానికి రావడం లేదని డాక్టర్ ఆత్మహత్య.. సంగారెడ్డిలో విషాదం

రెండ్రోజుల నుంచి తల్లీబిడ్డలు కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. చివరకు గ్రామంలోని వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గురువారం గుర్తించారు. అయితే తల్లి కనిపించకపోవడంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుందా... లేక పిల్లలను బావిలోకి తోసేసి పారిపోయిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కూతురిని ప్రేమించాడని కాటికి పంపారు... తమిళనాడులో యువకుడి దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.