యాప్నగరం

తిరుమలలో మరో అపచారం.. సిగరెట్ తాగిన ఇద్దరు యువకులు, వీడియో వైరల్

Tirumala Two Youth Smoking చేయడం కలకలంరేపింది. ఇద్దరు యువకులు అవ్వచారి కోన దగ్గర రోడ్డు పక్కన కూర్చుని ధూమపానం చేశారు. ఇదంతా ఎవరో వీడియో తీయడంతో ఘటన బయటపడింది. ఇలా బహిరంగంగా యువకులు సిగరెట్ తాగడంతో భద్రతా సిబ్బంది వైఫల్యమనే విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత వారమే తిరుమల కొండపై గంజాయిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.. గతంలో కూడా మద్యం పట్టుబడింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Mar 2023, 9:57 am

ప్రధానాంశాలు:

  • తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘటన
  • రోడ్డు పక్కనే కూర్చుని సిగరెట్ తాగారు
  • వైరల్ అవుతోన్న యువకుల వీడియో
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Youth Cigarette Smoking
తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో అవ్వచారి కోన సమీపంలో రోడ్డు పైనే ఇద్దరు యువకులు ధూమపానం చేస్తూ కనిపించారు. సిగరెట్ సేవించిన తర్వాత యువకులు వింత చేష్టలు చేశారు. ఏదో ఘనకార్యం చేసినట్లు సెల్ఫీలు దిగారు. ఈ సీన్ మొత్తాన్ని దూరం నుంచి ఎవరో వీడియో తీశారు. రోడ్డుపై, కాలిబాట మార్గం పక్కనే ధూమపానం చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. భక్తులు మండిపడుతున్నారు.. ఇది భద్రతా వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండాకాలం.. పొరపాటున ఆ సిగరెట్ నిప్పు కిందపడితే పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి పెద్ద ప్రమాదమని అంటున్నారు.
గతవారం కూడా తిరుమలలో గంజాయి దొరకడం కలకలంరేపింది. వైకుంఠం క్యూ కంప్లెక్స్‌‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరం దగ్గర విజిలెన్స్ అధికారులు గంజాయిని సీజ్ చేశారు. మొత్తం 125 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో ఈ ఘటనపైనా విమర్శలు వచ్చాయి.

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువై ఉన్న తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉంది. అలిపిరి దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే భక్తుల్ని కొండపైకి అనుమతిస్తారు. కానీ కొందరు మాత్రం నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. ఆ మధ్య కొందరు షికారీలు తిరుమలలో మాంసం తింటూ.. మద్యం సేవిస్తూ ఇద్దరు దొరికిపోయారు. అంతేకాదు గతంలో తిరుమల కొండపై మద్యం బాటిళ్లు ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. ఇలా వరుస ఘటనలతో తిరుమలలో విజిలెన్స్, భద్రతా సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు అలిపిరి గరుడ విగ్రహం ముందు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ ధర్నాకు దిగింది. తిరుమలను గంజాయి వనంగా మార్చారంటూ నినాదాలు చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవికి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలని.. అలాగే పాలకమడలిని రద్దు చేయాలన్నారు. తిరుమల పవిత్రతను పాలకమండలి, టీటీడీ ఉన్నతాధికారులు దెబ్బతీస్తున్నారని.. గంజాయిని తరిమికొడదాం.. తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.

తిరుమలలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరకడం దారుణమన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. గంజాయి రవాణాకు నిలయంగా మారుస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో గంజాయి అమ్మడంపై ముఖ్యమంత్రి స్పందించాలని.. వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. లేకపోతే ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతల సహకారంతో టన్నుల కొద్ది గంజాయి రవాణా సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపించారు. తిరుపతి నుంచే ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతోంది అన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.