యాప్నగరం

Tirumala శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో.. ఛీ.. ఛీ.. ఇదేం పని!

Tirumala: ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాంప్లెక్స్ అది. అక్కడ భక్తులకు అవసరమైన వస్తువులు అమ్మాలి. కానీ.. ఆ కాంప్లెక్స్‌లోని ఓ షాప్‌లో మద్యం కనిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 వైన్ బాటిల్స్ లభించాయి. దీంతో తిరుమలలో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 21 May 2023, 11:20 pm

ప్రధానాంశాలు:

  • తిరుమలలో మరోసారి మద్యం కలకలం
  • హెచ్.టి కాంప్లెక్స్‌లోని షాప్ నెం.78 మద్యం లభ్యం
  • విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ 5 మద్యం సీసాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Liquor in Tirumala
తిరుమలలో మద్యం
Tirumala: తిరుమల కొండపై మరోసారి మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. శ్రీవారి ఆలయానికి అతి దగ్గర్లోనే వైన్ బాటిల్స్ లభించడం కలకలం రేపుతోంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయం సమీపంలో హెచ్.టి కాంప్లెక్స్ ఉంది. దీంట్లో 78వ నంబర్ షాప్‌లో టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance) తనిఖీలు చేశారు. వీరి తనిఖీల్లో 5 వైన్ బాటిల్స్ లభించాయి.
మద్యం సీసాల (liquor bottles) ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆ షాప్‌ను సీజ్ చేశారు. గతంలో ఇదే కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మద్యం సీసాలు దొరికాయి. మద్యం లభించిన దుకాణదారుడిపై టీటీడి‌ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు‌ చేసి.. అతన్ని రిమాండ్‌కు తరలించారు.
అయితే.. ఆ షాప్ నిర్వహకుడి భార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 'నా భర్తకు మద్యం సేవించే అలవాటు ఉంది. చెక్ పాయింట్ వద్ద తప్పించుకున్నాను.. బ్యాగులో పెట్టుకుని సందులో నుంచి దూరి వచ్చేశానని చెప్పాడు. ఈ విషయం ఎలా తెలిసిందో.. అధికారులు వచ్చి తనిఖీ చేశారు. వారికి మద్యం బాటిల్స్ దొరికాయి' అని నిందితుడి భార్య చెప్పారు. అయితే.. ఇన్ని సెక్యూరిటీ పాయింట్స్ ఉన్నా అతను కొండపైకి ఎలా తీసుకొచ్చాడన్నది ఇప్పుడు చర్చకు దారి తీసింది. అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో అధికారులు కూపీ లాగుతున్నారు.

మద్యం ముచ్చట అలా ఉంటే.. తిరువీధుల్లో ఓ వాహనం కలకలం సృష్టించింది. వైసీపీ జెండాతో ఓ వాహనం తిరుమలకి వచ్చింది. దానిపై 'ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు' అంటూ జెండా ఉంది. అయితే.. ఆ వెహికిల్‌ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో వైసీపీ జెండాతోనే తిరుమలలో ఆ వాహనం చక్కర్లు కొట్టింది. అది ఎవరిది అనేది తెలియ రాలేదు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.