యాప్నగరం

భర్త గొంతు కోసి హత్య చేసిన మహిళ.. రక్తం తడచిన బట్టలతో రోడ్డుపైకి..

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. రేణిగుంట పట్టణంలో పట్టపగలే ఓ మహిళ తన భర్తను గొంతు కోసి హత్య చేసింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. రక్తం తడిచిన బట్టలతో ఆమె..

Samayam Telugu 20 Jan 2022, 12:20 pm
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. రేణిగుంట పట్టణంలో పట్టపగలే ఓ మహిళ తన భర్తను గొంతు కోసి హత్య చేసింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. రక్తం తడిచిన బట్టలతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుండగా.. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాలు ఇలా.. రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధిలో రవిచందర్ (53), వసుంధర (50) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే గతకొద్ది రోజలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో వసుంధన కత్తి భర్త రవిచందర్ గొంతు కోసింది. అతను చనిపోయిన తరువాత.. ఆమె ఇంటి నుంచి రక్తం తడిచిన బట్టలతో వీధిలోకి వచ్చారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రేణిగుంట అర్బన్ సీఐ అంజు యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.