యాప్నగరం

NTR పేరు మార్పుపై ఇక మాట్లాడను.. రాజకీయాల ఊసూ ఎత్తను: యార్లగడ్డ

Yarlagadda Lakshmi Prasad ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని.. బహిరంగంగా రాజకీయ నేతల పేర్లు ప్రస్తావించనని చెప్పారు. తిరుమలలో సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును అమలు చేయించడమే తన జీవిత లక్ష్యమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ పదవికి యార్లగడ్డ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Sep 2022, 9:12 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Yarlagadda Lakshmi Prasad
ఎన్టీఆర్‌ అంటే తనకు అమితమైన భక్తి అన్నారు రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ (Yarlagadda Lakshmi Prasad ). తెలుగు వ్యక్తిత్వానికి, తెలుగుజాతికి నిలువెత్తు నిదర్శనమైన ఎన్టీఆర్‌ అంటేగౌరవమని.. ఇప్పటికే హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై ఈ అంశంపై తాను మాట్లాడాలనుకోవడం లేదు అన్నారు. మంచో చెడో ఎన్టీ రామారావు విషయంలో ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు.
తాను రాజకీయ నాయకుడు కాకపోయినా అనేక రాజకీయాలు చేశానని.. ఇకపై వాటికి స్వస్తి పలుకుతానని తేల్చి చెప్పారు యార్లగడ్డ. ఇకపై రాజకీయాలు మాట్లాడనని శ్రీవారి సన్నిధిలో సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించనన్నారు. రాజకీయ నాయకులు చెడ్డవారని.. రాజకీయాలు చెడ్డవని తాను చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును అమలు చేయించడమే తన జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యమని.. తెలుగు భాష పరిరక్షణకు, వికాసానికి కృషి చేస్తానన్నారు. జిల్లాల్లో అధికారులను, కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను కలిసి 2018లో ఇచ్చిన జీవో ప్రకారం పాలనలో తెలుగు భాషను అమలు చేయాలని కోరుతామన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వ్యతిరేకం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధికార భాషా సంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధ కలిగించిందని.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని.. వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరికాదన్నారు. ఏపీ రాజధానికి ఎన్టీఆర్ నగర్ పేరు పెట్టాలని తాను కోరానని చెప్పారు. గుజరాత్‌లో రాజధానికి గాంధీ పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు రాజధానికి పేరు ప్రతిపాదించడంతో ఆకస్మికంగా అమరావతి పెట్టారని.. అమరావతికి ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.