యాప్నగరం

యువతిపై పెట్రోల్ పోసి నిప్పు.. చిత్తూరులో ఘోరం

మరో వారం రోజుల్లో పెళ్లి. ఈ సమయంలో కాబోయే పెళ్లికూతురిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

Samayam Telugu 17 Dec 2020, 11:13 am
పెళ్లి పీటలెక్కాల్సిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రపోతున్న సమయంలో ఆమెపై ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ములకలచెర్వు మండలం సోంపాళ్యం పరిధిలోని గుట్టకిందపల్లికి చెందిన సుమతి నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో ఏడురోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సుమతిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. శరీరంపై మంటలు వ్యాపించి ఆమె తీవ్రగాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెపై ఎవరు హత్యాయత్నం చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


Also Read: కొడుక్కి కరెంట్ షాకిచ్చిన తండ్రి.. అయినా వదలకుండా.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.