యాప్నగరం

తిరుమలలో వైసీపీ జెండా కలకలం.. జీపులో వెళుతూ!

Tirumala Ysrcp Flag On Car తిరుమలలో జీపుపై వైఎస్సార్‌సీపీ జెండా కలకలంరేపింది. కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి జీపును ఆపి ఆరా తీశారు. నెల్లూరు ఓ వ్యక్తి నుంచి జీపులో తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయంలో నేడు మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్ల చేసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 22 May 2023, 1:51 pm

ప్రధానాంశాలు:

  • తిరుమలలో వైసీపీ జెండా కలకలం
  • జీపుపై గుర్తించిన కొందరు భక్తులు
  • వీడియో వైరల్, విజిలెన్స్ ఆరా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
తిరుమలలో వైఎస్సార్‌సీపీ జెండా కలకలంరేపింది. ఓ జీపు ఆదివారం నిబంధనలకు విరుద్ధంగా తిరుమల సీఆర్వో కేంద్రం సమీపంలో వైఎస్సార్‌సీపీ జెండాతో కనిపించింది. ఆ జెండాపై ‘ఫ్యాను గుర్తుకే మీ ఓటు’ అని రాసి ఉంది. కొందరు ఆ జీపు దృశ్యాలను రికార్డు చేసి టీటీడీ విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. వారు వెంటనే జీపును ఆపి ప్రశ్నించారు. అయితే తమకు తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలతో తిరగరాదనే విషయం తెలియదని, నిబంధనలు తెలియక జెండాతో వచ్చామని జీపులో వారు సమాధానం చెప్పారు.
నెల్లూరుకు చెందిన వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఈ జీపులో తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు తిరుగు ప్రయాణంలో వైఎస్సార్‌సీపీ జెండాను వాహనం ముందుంచి తిరుమల చేరుకున్నారు. తిరుమలలో రాజకీయ జెండాలు, కరపత్రాలు, వ్యక్తుల ఫొటోలు, చిహ్నాలు తీసుకురావడం నిషేధం అని చెబుతున్నారు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గరే తనిఖీ చేసి వాటిని తొలగిస్తారట.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహస్థాపన ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబశుద్ధి కోసం
శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను మంత్రపూరితమైన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, ఆలయానికి, రాజగోపురానికి విమానకలశస్థాపన, విగ్రహస్థాపన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు మహా శాంతి, పూర్ణాహుతి, చతుర్దశ కలశస్నపనం, నవకలశస్నపనం, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు, రక్షాబంధనం, శయనాధివాసం, విశేష హోమాలు నిర్వహించారు.

మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం

మే 22న ఉదయం 5 గంటల నుండి 8.15 గంటల వరకు సుప్రభాతం , యాగశాల కైంకర్యాలు.

ఉదయం 8-15గంటల నుండి 8.45 గంటల వరకు మహా పూర్ణాహుతి.

ఉదయం 8-45 గంటల నుండి 9గంటల వరకు యాత్రదానం, కుంభ ప్రదక్షణ

ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు మిథున లగ్నంలో కళా వాహన , అక్షతా రోహణ, బ్రహ్మఘోష , మహా సంప్రోక్షణ.

ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం.

ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం.

సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం. తిరువీధి ఉత్సవం , ధ్వజావరోహణం.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
భక్తులందరికీ దర్శనం చేసుకోవడానికి వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా. భక్తులకు మజ్జిగ, తాగు నీరు, ప్రసాదాలు విరివిగా అందించడంతోపాటు ఎక్కువ సంఖ్యలో షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్తు, పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. వాహనాల, రద్దీ క్రమబద్దీకరణ కోసం స్థానిక పోలీసుల సహకారంతో తగిన ఏర్పాట్లు చేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.