యాప్నగరం

ఎమ్మెల్యే రోజా ఊర మాస్: ప్లేయర్సే అవాక్కయ్యేలా కబడ్డీ, కబడ్డీ.. వీడియో వైరల్!

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తను ఎంతో ప్రత్యేకమో నిరూపించారు. యువకులతో కలిసి కబడ్డీ ఆడారు. ఆమె ఆటతీరుకు కబడ్డీ ప్లేయర్సే ఆశ్చర్యపోయారు.

Samayam Telugu 7 Mar 2021, 9:05 pm
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరితో పాటు పుత్తూరు మున్సిపాలిటీలో స్థానిక నేతలతో కలిసి ఆమె వీధివీధి కలియదిరుగుతూ వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.
Samayam Telugu కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా


గత కొద్ది రోజులుగా ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఎమ్మెల్యే రోజా.. ఆదివారం కాసేపు సేదతీరారు. యువకులతో సరదాగా కబడ్డీ ఆడారు. చిన్నప్పుడు పాఠశాల రోజుల్లో కబడ్డీ ప్లేయర్ అయిన ఎమ్మెల్యే రోజా, తాజాగా తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే రోజా ఎంతో నేర్పుగా కబడ్డీ ఆడిన తీరు చూసి ఆటగాళ్లతో పాటు అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు.


నిండ్రలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ టోర్నమెంటును ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. అనంతరం ఎవరూ ఊహించని విధంగా బరిలోకి దిగారు. కబడ్డీ కోర్టులో కూతకు దిగి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తిరువేలంగాడు- రేణిగుంట మధ్య జరిగిన రసవత్తర పోటీలో మొదట రేణిగుంట టీం వైపు ఆడారు. తర్వాత మళ్లీ తిరువేలంగాడు జట్టు తరఫున రోజా కబడ్డీ ఆడారు. ఎమ్మెల్యే రోజా కబడ్డీ కూతకు వచ్చిన సమయంలో స్థానికులు, అభిమానులతో పాటు క్రీడాకారులు సైతం ఈలలతో సందడి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.