యాప్నగరం

పేద పిల్లలకు న్యాయం చేయలేకపోయా, నాకు అర్హత లేదు.. వైసీపీ పదవికి గుడ్ బై

Chittoor జిల్లా వరదయ్య పాలెం మండలం గోవర్ధనపురం పాఠశాలకు వెళ్లే దారిలో మద్యం దుకాణం ఏర్పాటుకు నిరసన వైఎస్సార్సీపీ విద్యా విభాగ కన్వీనర్ రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను..

Samayam Telugu 23 Jan 2022, 8:51 am
చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం గోవర్ధనపురం పాఠశాలకు వెళ్లే దారిలో మద్యం దుకాణం ఏర్పాటుకు నిరసన వైఎస్సార్సీపీ విద్యా విభాగ కన్వీనర్ రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి, పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యేకు రాజీనామా లేఖను పంపించారు. వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురంలోని ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లే దారిలో మద్యం దుకాణం ఏర్పాటు చేసి బాలికల మాన ప్రాణాలతో, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాజేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
Samayam Telugu వైసీపీ నేత రాజీనామా


అధికార పార్టీ ప్రతినిధిగా పేద పిల్లలకు న్యాయం చేయలేని ఈ పదవి తనకు అవసరం లేదంటూ రాజేష్ వైఎస్సార్సీపీ విద్యా విభాగం కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బడి, గుడిలకు వంద మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు ఉండరాదని ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు నుంచి అధికారులు వరకు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా మద్యం దుకాణం ఏర్పాటు చేస్తుండటం తనను కలచివేసిందని ఆవేదన వెలిబుచ్చారు.

గత కొన్ని రోజులుగా పాఠశాలల దారిలో మద్యం దుకాణాలు వద్దని ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం అవుతున్నా.. అక్కడే ఏర్పాటు చేయడం దుర్మార్గ చర్యగా రాజేష్ వాపోయారు. పాఠశాలల మార్గంలో మద్యం దుకాణం వల్ల మందుబాబుల ఆగడాలు, బాలికలపై అఘాయిత్యాలు జరిగే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నా.. దారుణంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. అధికార పార్టీ ప్రతినిధిగా పిల్లలకు న్యాయం చేయలేని తాను ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదని.. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి పంపనున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.