యాప్నగరం

కృష్ణా: వివాహ వేడుకకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

వివాహ వేడుకకు హాజరయ్యేంందుకు ఆటోలో బయల్దేరారు.. ఈ క్రమంలో ఆటో వాహనాన్ని తప్పించబోయి కిందపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. పలువురికి గాయాలు అయ్యాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 May 2022, 3:07 pm

ప్రధానాంశాలు:

  • పెళ్లికి బయల్దేరినవారిని వెంటాడిన రోడ్డు ప్రమాదం
  • వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది
  • ఘటనలో నలుగురు చనిపోగా, పలువురికి గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మోపిదేవి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు వెళుతుండగా విషాదం వెంటాడుతోంది. చల్లపల్లి మండలం చింతలమడకు చెందిన పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగే వివాహానికి ఆటోలో బయలుదేరింది. చల్లపల్లి హైవేపై కాశా నగర్‌ దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20మంది వరకు ఉన్నారు.. ఘటనలో గాయపడిన మరో ఏడుగురు క్షతగాత్రులను చల్లపల్లి, మచిలీపట్నం ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహానికి వెళుతున్నామనే ఆనందంలో అందరూ ఉండగా.. అనుకోకుండా ప్రమాదం వారిని వెంటాడింది. నలుగురి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.