యాప్నగరం

గొర్రెల కాపర్ల పొట్టగొట్టిన లారీ.. కృష్ణా జిల్లాలో విషాదం

కృష్ణా జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో.. 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 25 Feb 2021, 5:17 pm
కృష్ణా: నూజివీడు-హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు మీద వెళ్తున్న గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 50 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మీర్జాపురం మల్లవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి.
Samayam Telugu sheeps accident

ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న గొర్రెలు అకస్మాత్తుగా చనిపోవడంతో గొర్రెల కాపరులు రోదించిన తీరు కలచి వేసింది. రూ.5 లక్షల విలువైన గొర్రెలు అన్యాయంగా బలైపోయాయని వారు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కాపర్లు వేడుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.