యాప్నగరం

మాస్క్‌లు, శానిటైజర్లు అమ్ముకోడానికి పెద్ద కుట్ర.. ఆర్.నారాయణమూర్తి సంచలనం

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 21 Mar 2021, 4:32 pm
కరోనా రెండోసారి వ్యాప్తి చెందటం అనేది పూర్తిగా బూటకమని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో హాస్యానందం సంస్థ ఏర్పాటు చేసిన కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కరోనా రెండోసారి వ్యాప్తి అంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు తయారు చేసే శానిటైజర్లు, మాస్క్‌లు, ఇతర మెడికల్‌ వస్తువులు అమ్ముకొని సొమ్ము చేసుకోవటానికే ఈ ఎత్తుగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు కూడా కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
Samayam Telugu ఆర్.నారాయణమూర్తి


కరోనా మహమ్మారి వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులు మాత్రం వేల కోట్ల రూపాయిలు దండుకున్నాయని దుయ్యబట్టారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరించటం దారుణమన్నారు.

కేంద్ర ప్రభుత్వం పంచ భూతాలను కూడా అమ్ముకునే విధంగా చర్యలు చేపడుతుందని ఆర్.నారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి అందరూ మద్దతు ప్రకటించాలని ఆర్‌.నారాయణమూర్తి పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.