యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. టీడీపీకి షాకిచ్చేలా, ఈ నెల 8న

శంకుస్థాపన చేసి నిర్మాణం ద్వారా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా టీడీపికి చెక్ పెట్టొచ్చని జగన్ సర్కార్ భావిస్తోంది. శుక్రవారం ఉదయం 11.01 గంటల ముహుర్తానికి శంకుస్థాపన.

Samayam Telugu 7 Jan 2021, 6:58 am
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేవాలయాల పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. విజయవాడలో కూలగొట్టిన దేవాలయాల పునఃనిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు. ఆగమ పండితులు నిర్ధారించిన ప్రకారం శుక్రవారం ఉదయం 11.01 గంటల ముహుర్తానికి శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. 9 గుడులకు సంబంధించి రూ.3.79 కోట్లతో తొలిదశలో పునఃనిర్మాణ పనులకు.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి, విస్తరణలో భాగంగా రూ.77 కోట్లతో చేపట్టిన మరో 8 పనులకు కూడా సీఎం జగన్‌ భూమి పూజ చేయనున్నారు
Samayam Telugu సీఎం జగన్


బుధవారం విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఆ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ సమావేశమై దేవాలయాల పునర్నిర్మాణంపై సమీక్షించారు. కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన వాటి జాబితాను పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు విడతలుగా శంకుస్థాపన ప్రదేశాన్ని మంత్రి వెలంపల్లి అధికారులు సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు.

గతంలో 2016 పుష్కరాల నిర్వహణ, కనకదుర్గ పైవంతెన నిర్మాణం, నాలుగు లైన్ల నేషనల్ హైవే విస్తరణలో భాగంగా కొన్ని ఆలయాలను తొలగించారు. నాడు దేవాలయాలను తొలగించడం వివాదాస్పదమైంది. ప్రధానంగా కనకదుర్గ పైవంతెన నిర్మాణానికి, ట్రాఫిక్‌ నియంత్రణకు ఇబ్బందికరంగా ఉన్నవాటిని నాడు తొలగించారు. వాటన్నింటిని ఇప్పుడు పునరుద్ధరించే కార్యక్రమం చేపడుతున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ కింది భాగంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆలయాలకు శంకుస్థాపన చేసి నిర్మాణం ద్వారా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా టీడీపికి చెక్ పెట్టొచ్చని జగన్ సర్కార్ భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.