యాప్నగరం

ఇక చర్చల్లేవ్: ఫిబ్రవరి 3న చలో విజయవాడ.. లక్షలాది మంది ఉద్యోగులతో పోరాటానికి సిద్ధం

ఏపీలో పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి సిద్ధమయ్యారు. లక్షమందితో ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నెల పాత జీతాలే చెల్లించాలని..

Samayam Telugu 27 Jan 2022, 7:55 pm
ఏపీలో పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి సిద్ధమయ్యారు. లక్షమందితో ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద మాట్లాడారు. చర్చలకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి ప్రకటించగా.. ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం మంత్రుల కమిటీ నుంచి సమాధానం వచ్చే వరకు చర్చలకు వెళ్లేదిలేదని స్పష్టంచేశారు. తమకు జరిగిన అన్యాయానికి సజ్జలనే సాక్ష్యం అన్నారు.
Samayam Telugu ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు


తాము చర్చలకు వెళ్లాలంటే మూడు కోరికలు ఉన్నాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం కొత్తగా జారీచేసిన పీఆర్సీ జీవోలతో తమకు తీవ్రనష్టం కలుగుతుందని చెప్పారు. తమ కోరికలు నెరవేర్చడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులే చర్చలకు రావడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేకసార్లు తిరిగి.. తమ సమస్యలను వివరించామన్నారు. తమకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జలనే సాక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఫిబ్రవరి 3న చలో విజయవాడకు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని ఆయన కోరారు. ఈ నెల పాత జీతాలే చెల్లించాలని కోరారు. జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అనంతరం పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తమ మూడు ప్రధాన డిమాండ్లపై మంత్రుల కమిటీ సమాధానం ఇచ్చే చర్చలకు వెళ్లబోమని స్పష్టంచేశారు. తమ డిమాండ్లపై మంత్రుల కమిటీ లేఖ ఇచ్చామని తెలిపారు. అయితే ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. తమ జీతాలపై ప్రభుత్వం మొండిగా వెళ్లొద్దని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.