యాప్నగరం

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Samayam Telugu 23 Oct 2021, 6:38 pm
ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, రెండు సంవత్సరాల ఫలితాలను శనివారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించింది.
Samayam Telugu ప్రతీకారాత్మక చిత్రం


ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని మైనర్ సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేశారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఎగ్జామ్ పేపర్ రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం పరీక్షలు 3,24,800 మంది, సెకండీయర్ పరీక్షలు 14,950 మంది రాసినట్లు ఆయన తెలిపారు. షార్ట్ మెమోలు ఈ నెల 25 సాయంత్రం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.