యాప్నగరం

విజయవాడ: పెడన మున్సిపల్ కమిషనర్‌పై పారిశుద్ధ్య కార్మికుల దాడి.. కారణం తెలిసి అంతా అవాక్కు

వాకింగ్‌కు వెళుతున్న తనపై ఉద్దేశపూర్వకంగా కొందరు దాడి చేశారని కమిషనర్ అంజయ్య ఆరోపిస్తున్నారు. తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు అన్నారు.

Samayam Telugu 28 Dec 2020, 10:27 am
కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో ఉద్రిక్తత కనిపించింది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై పారిశుద్ధ్య కార్మికులు దాడికి చేశారు. అంజయ్య వాకింగ్‌కి వెళ్తున్న సమయంలో దాడికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఆయన ఓ మహిళా వర్కర్‌ను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన పోలీసులకు అంజయ్యపై కార్మికులు ఫిర్యాదు చేశారు. కమిషనర్‌పై కార్మికులు దాడి చేయడం స్థానికంగా కూడా సంచలనంగా మారింది.
Samayam Telugu పెడన


వాకింగ్‌కు వెళుతున్న తనపై ఉద్దేశపూర్వకంగా కొందరు దాడి చేశారని కమిషనర్ అంజయ్య ఆరోపిస్తున్నారు. తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు అన్నారు. తనపై వస్తోన్న ఆరోపణలను అంజయ్య ఖండించారు.. ఈ ఘటన, కార్మికుల ఆరోపణలపై పెడన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కార్మికుల దాడిలో కమిషనర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.