యాప్నగరం

ఎంత ఘోరం అమ్మా.. విజయవాడలో ఊహకందని విషాదం!

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి షాకింగ్ డెసీషన్ తీసుకుంది.

Samayam Telugu 16 Apr 2021, 8:47 am
విజయవడ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నున్న గ్రామానికి చెందిన సురేంద్రకు వాణి (26)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి భావన (3), అక్షయ (10 నెలలు) ఇద్దరు కుమార్తెలు సంతానం.
Samayam Telugu విజయవాడలో తల్లీపిల్లలు ఆత్మహత్య


సురేంద్ర గత కొన్నేళ్లుగా గ్రామంలోనే చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. కరోనా వైరస్, లాక్‌డౌన్ ప్రభావంతో ఇటీవల వ్యాపారపరంగా దెబ్బతిన్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆటో నడిపి ఇంటికి రాగా, భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు వాంతులు చేసుకోవడం గమనించాడు. ఏమైందని వారిని ప్రశ్నించగా.. పురుగుల మందు తాగమని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు.

వెంటనే భార్య, పిల్లలను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఇద్దరు చిన్నారులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ తొలుత భావన, సాయంత్రం వాణి, చిన్నారి అక్షయ మృత్యు ఒడికి చేరారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

అయితే, విచారణలో తల్లి, కూతుళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వేధింపులు తట్టుకోలేకనే పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. పెళ్లినాడు అత్తింటివారు ఇస్తామన్న అర ఎకరం పొలం కోసం భర్త పెట్టిన వేధింపుల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

పూర్తి వివరాలు: అర ఎకరం కోసం భర్త టార్చర్.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.